Wednesday, May 22, 2024

KTR: టీఆర్ఎస్ కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం

రాష్ట్ర రాజకీయాలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయo అని అన్నారు. కాంగ్రెస్ కు 6 సీట్లు వస్తే..  బీజేపీకి 5 సీట్లు రావొచ్చు అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పరిగెట్టినంతా మాత్రాన పదవులు రావు అని, విమర్శలు చూస్తే పదవులపై వైరాగ్యం కలుగుతుందన్నారు. బీజేపీ పనికిమాలిన పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీ సమాజంలో లేదని సామాజిక మాధ్యమంలోనే ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పనయిపోయిందని తెలిపారు. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో గత్యంతరం లేక బీజేపీ గెలిచిందన్నారు. గోలేమాల్ గుజరాత్ మోడల్… లేక గోల్డెన్ తెలంగాణ మోడల్ దేశ ప్రజలకు చెబుతామన్నారు. దేశానికి అజెండా ఖరారు చేశామన్న మంత్రి కేటీఆర్… తెలంగాణలో వైవిద్యం ఉందన్నారు. కుల మత రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. కులమే ప్రధాన మైతే కేసీఆర్ సీఎం అయ్యేవారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయా లే కీలకం అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement