Sunday, May 19, 2024

దళిత బంధు చారిత్రాత్మకం- మంత్రి కేటీఆర్

తెలంగాణలోని దళిత జాతి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం చారిత్రాత్మకమైనదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో దళిత బంధు ద్వారా మంజూరైన నిధులతో నిర్మించతలపెట్టిన రైస్ మిల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా దళిత కుటుంబాల అభివృద్ధి కోసం ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజలు గులాబీ పార్టీ వైపే ఉన్నారన్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement