Friday, May 17, 2024

Gangula: కరీంనగర్ లో కేబుల్ బ్రిడ్జి.. 40 కోట్లతో రోడ్డు నిర్మాణం

కరీంనగర్ కు మణిహారంగా రూ.183 కోట్లతో కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు అయిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కమాన్ నుండి కేబుల్ బ్రిడ్జి వరకు 40 కోట్లతో రోడ్డు నిర్మాణం సెంట్రల్ లైటింగ్ తో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. కేబుల్ బ్రిడ్జి వద్ద ఇండియాలో మొదటగా 6 కోట్లతో డైనమిక్ లైట్లు ఏర్పాటు అవుతుందన్నారు. రైతులకు సర్వీస్ రోడ్డు ఇతర సదుపాయాలకు 7 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మూడు నెలల్లో కేబుల్ బ్రిడ్జి పూర్తి స్థాయిలో సిద్ధం అవుతుంన్నారు. కరీంనగర్ – సిరిసిల్ల రోడ్ అద్భుతంగా తయారవుతుందని చెప్పారు.

తెలంగాణలో బ్యూటీవుల్ రివర్ మానేరు ఉండనుందని మంత్రి గంగుల తెలిపారు. చెక్ డ్యామ్ లు వరదల వల్ల ధ్వంసం అయ్యాయని, ఆ ప్రాంతంలో డిజైన్ మార్చి మరోసారి నిర్మిస్తామన్నారు. కాకతీయ కెనాల్ పై 30 కోట్లతో రెండు బ్రిడ్జిల నిర్మాణం అవుతున్నాయని వివరించారు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కరీంనగర్ అభివృద్ధి పైనే దృష్టి పెట్టామన్నారు. రూ. 350 నిధులు అభివృద్ధికి కేటాయించగా.. 100 కోట్ల పనులు ఇప్పటికే పూర్తి ఆయ్యాయని తెలిపారు. మరికొన్ని పనులు త్వరలోనే జరగనున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికే పాటుపడతాం తప్ప.. ఢిల్లీకి తాము బిచ్చగాళ్ల లాగా పోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తోందని మంత్రి గంగుల మండిపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement