Sunday, May 5, 2024

క‌రెంట్ బిల్లు క‌ట్టా-ఇదంతా త‌ప్పుడు ప్ర‌చారం- మంత్రి బొత్స‌

తాను క‌రెంట్ బిల్లు క‌ట్టినా క‌ట్ట‌లేదంటున్నార‌ని ఏపీ మంత్రి బొత్స‌స‌త్య‌నారాయ‌ణ వివ‌రణ ఇచ్చారు. కాగా మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. మీరు కరెంటు బిల్లు క్లియర్ చేసిన వెంటనే మీ ఇంటికి కరెంటు సరఫరా చేస్తాం. 15 నెలలుగా మీరు బిల్లు చెల్లించలేదు. అందుకే కరెంట్ కట్ చేశాము”అంటూ బొత్స సత్యనారాయణకు ట్విట్టర్ వేదికగా విద్యుత్ శాఖ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. వాస్తవానికి తెలంగాణ విద్యుత్‌ శాఖ ఆ ట్వీట్‌ చేయలేదు. ఫేక్‌ ఐడీతో.. ఈ ట్వీట్‌ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమని.. తాను కరెంట్‌ బిల్‌ కట్టానని.. ఫ్రూప్స్‌ చూపించారు బొత్స. దీంతోనైనా ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement