Saturday, May 4, 2024

శ్రీవారిని ద‌ర్శించుకున్న మంత్రి రోజా – ప్రాణం ఉన్నంత వ‌ర‌కు జ‌గ‌న‌న్న వెంటే న‌డుస్తా

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు మంత్రి రోజా. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు..’జ‌గ‌న‌న్న అండ‌దండ‌లతో, భ‌గ‌వంతుడి ఆశీస్సుల‌తో, న‌గ‌రి ప్ర‌జ‌ల ప్రేమాభిమానాల‌తో న‌న్ను మంత్రిగా నియ‌మించ‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృతం అని అనుకుంటున్నాను. ఎందుకంటే భ‌గ‌వంతుడంటే నాకు ఎంత ఇష్ట‌మో మీ అంద‌రికీ తెలుసు. భ‌గ‌వంతుడికి సేవ చేసుకుంటూ, అలాగే ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవ‌కాశాన్ని జ‌గ‌న‌న్న‌ నాకు ఇచ్చారు. నా ప్రాణం ఉన్నంత వ‌ర‌కు నేను జ‌గ‌న‌న్న వెంట‌నే న‌డుస్తాను. జ‌గ‌న‌న్న ముఖ్య‌మంత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, మ‌హిళ‌ల‌ కోసం ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.పర్యాటకం, సంస్కృతి శాఖ మంత్రిగా ఆయా రంగాల అభివృద్ధికి కృషి చేస్తాను” అని రోజా అన్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి రావడానికి ప్రార్థ‌న‌లు చేసిన వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement