Wednesday, May 1, 2024

ధోని కుమారైకి.. జెర్సీ పై సంత‌కం చేసి గిఫ్ట్ పంపిన మెస్సీ

త‌న అభిమాని..టీం ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని కుమారై జీవా ధోనికి గిప్ట్ పంపాడు ..ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జివాకు పంపించాడు. అభిమాన ఆటగాడి నుంచి అందిన కానుకను చూసుకుంటూ జివా ధోని మురిసిపోతోంది. ఆ జెర్సీ వేసుకుని తీసుకున్న ఫొటోను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది.

ఈ ఫొటోలో జెర్సీపై పారా జివా(జివా కోసం) అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది. క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ తనకెంతో ఇష్టమైన ఆట అంటూ మహేంద్ర సింగ్ ధోని గతంలో చాలాసార్లు చెప్పారు. తండ్రిలాగే జివాకు కూడా ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటను తండ్రితో కలిసి చూస్తుంటుంది. ఈ క్రమంలో మెస్సీ ఆటోగ్రాప్ చేసిన జెర్సీ అందుకోవడంపై జివా సంతోషం వ్యక్తంచేస్తోంది. ఇన్ స్టా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement