Thursday, April 18, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ… శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 14 కంపార్టుమెంట్లలో భ‌క్తులు వేచి ఉండ‌గా… టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 30 గంటల సమయం పట్టనుంది. మంగళవారం శ్రీవారిని 70,496 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 25,500 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.88 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement