Saturday, May 4, 2024

సోద‌రి జ్ఞాప‌కార్థం – టిటిడికి రూ.9కోట్ల, 20ల‌క్ష‌ల విరాళం

స్వ‌ర్గీయ డాక్ట‌ర్ ఆర్ ప‌ర్వ‌తం జ్ఞాప‌కార్థం ఆమె సోద‌రి రేవ‌తి విశ్వ‌నాథం భారీ మొత్తంలో టిటిడికి విరాళం అంద‌జేశారు. రూ. 9 కోట్ల 20 లక్షల విరాళాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను దాత స్వర్గీయ డాక్టర్ ఆర్ పర్వతం జ్ఞాపకార్థం ఆమె సోదరి రేవతి విశ్వనాథం శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు. చెన్నె మైలాపూర్ కు చెందిన స్వర్గీయ Dr. R. Parvatam పేరు మీద బ్యాంకులో రూ. 3 కోట్ల 20 లక్షల నగదు డిపాజిట్లు ఉన్నాయి. దీంతోపాటు రూ. 6 కోట్ల విలువైన రెండు ఇళ్ళు ఉన్నాయి. డాక్టర్ పర్వతం కన్నుమూయడంతో ఆమె జ్ఞాప‌కార్థం, ఆమె సోదరి రేవతి విశ్వనాథం ఈ ఆస్తిని శ్రీ వేంకటేశ్వర స్వామివారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పత్రాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు. ఇందులో రూ. 3 కోట్ల 20 లక్షలు చిన్నపిల్లల ఆసుపత్రికి అందించనున్నట్లు.. మిగతా రూ 6 కోట్ల ఆస్తి స్వామివారికి చెందేలా విరాళాన్ని అందించారు. ఈ మేరకు టీటీడీ ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement