Wednesday, April 24, 2024

ఇండియ‌న్ ఆర్మీ క‌ష్టాలు – సెల్యూట్ చేయాల్సిందే

సైనికులు నిత్యం మ‌న‌ల్ని కాపాడేందుకు వారు శ‌త్రువుల‌తో పోరాడుతూ దేశ స‌రిహ‌ద్దుల్లో ప‌హ‌రా కాస్తుంటారు. ఎముక‌లు కొరికే చ‌లిని సైతం వారు లెక్క‌చేయ‌రు. కాగా జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇలా హిమాలయాలను ఆనుకుని ఉన్న రాష్ట్రాలను అనుకుని పాకిస్థాన్, చైనాలు ఉన్నాయి. వీటిపై ఓ క‌న్ను వేసి ఉంచాలంటే .. సముద్రమట్టం నుంచి కొన్ని వేల అడుగుల ఎత్తులో మన సైనికులు పహారా కాయాల్సిందే. సియాచిన్, కార్గిల్, ద్రాస్ సెక్టార్, హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో 15 వేల అడుగుల ఎత్తులో సైన్యం మన బార్డర్లను రక్షిస్తూ.. శత్రువులపై కన్నేసి ఉంచుతుంది. అటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న మన సైన్యానికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది భారత సైన్యం. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది ఉత్తరాఖండ్ హిమాలయాల చుట్టూ 15,000 అడుగుల ఎత్తులో గడ్డకట్టించే తక్కువ ఉష్ణోగ్రతలలో మంచుతో కప్పబడిన ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోను చూస్తే.. బార్డర్ ల‌లో మన సైనికులు ఎలాంటి విధులు నిర్వర్తిస్తున్నారో.. ఎంత కష్టపడుతున్నారో అర్థం అవుతుంది. అందుకే మ‌న‌మంతా వారికి ఎంతో రుణ‌ప‌డి ఉన్నామ‌నే విష‌యం అర్థం చేసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement