Thursday, April 25, 2024

BIG Breaking: ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా సినీ నటుడు అలీ

ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా సినీ నటుడు అలీని నియమించారు. అలీకి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే సీఎం జగన్ ను అలీ కలిసిన సంగతి తెలిసిందే.

కాగా, హాస్యనటుడు అలీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కీలక పదవి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సీటు ఇస్తారని వార్తలు వినిపించినా.. అది వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement