Saturday, May 18, 2024

పెళ్లి పీటలెక్కనున్న మేయర్​, ఎమ్మెల్యే.. లవ్​ మ్యారేజీకి గ్రీన్​ సిగ్నల్

దేశంలోనే అతి తక్కు వయస్సులో మేయర్​ అయిన ఆర్య రాజేంద్రన్​ పెళ్లి చేసుకోబోతోంది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం మేయర్​గా ఆర్య రాజేంద్రన్​ ఉన్నారు. ఇవ్వాల తిరువనంతపురంలోని ఏకేజీ సెంటర్​లో బలుస్సేరి ఎమ్మెల్యే సచిన్​ దేవ్​తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకకు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు హాజరయ్యారు.

కాగా, ఆర్య రాజేంద్రన్ భారతదేశపు అతి పిన్న వయస్కురాలైన మేయర్ కాగా, ప్రస్తుత కేరళ అసెంబ్లీలో సచిన్ దేవ్ అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆర్య రాజేంద్రన్ 21 ఏళ్ల వయసులో మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత నెలలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) విద్యార్థి విభాగం అయిన బాలసంఘంలో కలిసి పనిచేస్తున్నప్పుడు వీరి పరిచయం పెరిగింది. అది కాస్త ప్రేమగా మారింది. కాగా, వీరిని అభినందిస్తూ సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి వారికి పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. వచ్చే నెలలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement