Thursday, May 2, 2024

ప్రైవేట్ కర్మాగారంలో భారీ పేలుడు : ఇంజ‌నీర్ మృతి, మ‌రో ఆరుగురికి తీవ్ర‌గాయాలు

శ్రీకాళహస్తి మండల సమీపంలోని కమ్మిలు తయారు చేసే ప్రైవేట్ కర్మాగారంలో పేలుడు సంఘటన జరిగి ఒక నవ ఇంజనీర్ మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమ‌వారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. విషయం యాజమాన్యం బయటకు చెప్పకుండా సొంత వాహనాల్లో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఎలైట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అందులో మంగళవారం మధ్యాహ్నం వడమాలపేట మండలం చింతకాలువ గ్రామానికి చెందిన రాజశేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. బీహార్ రాష్ట్రానికి చెందిన మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. అందులో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన వరదరాజులు (45) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడని, అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇండస్ట్రీ కర్మాగారంలో ఫర్ నర్స్ లాడెన్ ఇనుమును కరిగించే యంత్రం ఒక్కసారిగా పేలడంతో ఈ సంఘటన జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement