Friday, April 26, 2024

సుక్మా ఎన్‌కౌంటర్‌ లో.. మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బెజ్జీ అటవీ ప్రాంతంలో ఈరోజు మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. ఈ ఉదయం భందర్‌పదర్‌ గ్రామ సమీపంలోని బెజ్జీ అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్‌ గార్డులు మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో గాలింపు బృందాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని, పోలీసుల కాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోయాడని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. మృతుడిని మాడ్‌ డివిజన్‌ కమిటీ కమాండర్‌ హడ్మా అలియాస్‌ సంకుగా గుర్తించిన‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement