Saturday, April 27, 2024

ఈ నెల 30న మ‌న్ కీ బాత్ – ప్ర‌త్యేకంగా ట్వీట్ చేసిన ప్ర‌ధాని మోడీ

ఈ ఏడాదిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫ‌స్ట్ టైం మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు మోడీ స్పెష‌ల్ గా ట్వీట్ కూడా చేశారు. ఈ మ‌న్ కీ బాత్ లో ప్ర‌జ‌లు, పౌరులు పాల్గొని త‌మ ఆలోచ‌న‌లు, సూచ‌న‌లు పంచుకోవాల‌ని ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా కోర‌డం విశేషం. ఈ నెల 30వ తేదీన, 2022లో మొదటి #MannKiBaat కార్యక్రమం జరుగుతుంది. స్ఫూర్తిదాయకమైన జీవిత కథలు, అంశాల ను మీరు నాతో పంచుకోవడానికి చాలా ఉన్నాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వాటిని @mygovindia లేదా NaMo యాప్‌లో షేర్ చేయండి. 1800-11-7800 డయల్ చేయడం ద్వారా మీ సందేశాన్ని రికార్డ్ చేయండి. ” అంటూ మోడీ ట్వీట్ చేశారు. ప్ర‌జ‌ల‌తో మాట్లాడేందుకు మోడీ త‌ర‌చుగా మ‌న్ కీ బాత్ లో పాల్గొంటార‌నే సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement