Thursday, May 9, 2024

ఉత్తమ సేవలకు అత్యున్నత పురస్కారం.. కోవిడ్ సమయంలో ఏడాది అన్నదానం

ఉత్తమ సేవలకు అత్యున్నత పురస్కారం దక్కింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన సమయంలో వేలాది మందికి ఏడాదిపాటు అన్నదానం చేసిన కరీంనగర్ కు చెందిన నగునూరి రాజేందర్ కు కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం అందజేశారు. జగిత్యాలలోని శ్రీదేవి గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కోవిడ్ సమయంలో చేసిన సేవలకు గాను రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారం అవార్డ్ జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ కుమార్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపద సమయంలో ఆకలి తీర్చడం అభినందనీయమని రాజేందర్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ అర్ట్స్ థియేటర్ నిర్వాహకులు రాజు గుండెటితో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement