Monday, May 6, 2024

నల్లగొండకు మ‌ల్లు స్వ‌రాజ్యం పార్థివదేహం.. మెడికల్‌ కాలేజీకి అప్పగింత

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మ‌ల్లు స్వ‌రాజ్యం నిన్న రాత్రి క‌న్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న మ‌ల్లు స్వ‌రాజ్యం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.  ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్ లోని చార్మినార్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న మాకినేని బసవపున్నయ్య భవన్ లో ప్రజల సందర్శనార్థం 9.30 గంటల వరకు మల్లు స్వరాజ్యం గారి పార్థివ దేహాన్ని ఉంచనన్నారు. ఈ ఉదయం  9.30 గంటలకు చార్మినార్ క్రాస్ రోడ్(M B BAVAN) నుండి బయలు దేరి 11.30 గంటల వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయానికి పార్థివ దేహం చేరుకుంటుంది.

నల్లగొండ జిల్లా సిపియం కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఈ ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంచుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు జిల్లా సిపిఎం కార్యాలయం నుండి ర్యాలీగా అంతిమయాత్ర మొదలై ప్రకాశం బజార్,ఆర్.పి రోడ్ మీదుగా పెద్దగడియారం సెంటర్ కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. పెద్ద గడియారం సెంటర్లో 2.30 నుండి 3.30 గంటల వరకు సంతాప సమావేశం జరుగుతుంది. ఇందులో ముఖ్యులు పాల్గొంటారు. సరిగ్గా 3.30 గంటలకు పెద్ద గడియారం నుండి పార్థివ దేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలిస్తారు. 3.45 నిమిషాలకు దివంగత మల్లు స్వరాజ్యం భౌతిక ఖాయన్ని మెడికల్ కళాశాలకు అప్పగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement