Wednesday, April 24, 2024

షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. కత్తితో యువకుడు హల్ చల్

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలో టీఆర్ఎస్ వార్డు సభ్యుడు ఒకరు కత్తితో హల్‌చల్ చేయడం కలకలం రేపింది. శనివారం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం నుంచి మొదలైన షర్మిల పాదయాత్ర మధ్యాహ్నం బొల్లేపల్లి చేరుకుంది. సాయంత్రం అక్కడే ‘షర్మిలక్కతో మాటముచ్చట’ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తుండగా.. టీఆర్ఎస్ వార్డు సభ్యుడు తాళ్లపల్లి శ్రావణ్‌ మాంసం కోసే కత్తితో వీరంగం సృష్టించాడు. యాత్రకు ప్రజలతో వచ్చిన వాహనం టైరును కోశాడు. పీహెచ్‌సీ వద్ద ఫ్లెక్సీ కడుతున్న తాడును శ్రావణ్‌ లాగడంతో వైఎస్సార్‌టీపీ కార్యకర్త శివరాజ్‌ మెడకు అది ఉచ్చులా బిగుసుకొని గాయమైంది. దీంతో బాధితుడు కేకలు వేయడంతో పోలీసులు శ్రావణ్‌ను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న షర్మిల కార్యకర్తలతో కలసి రాస్తారోకోకు దిగారు. శ్రావణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో బొల్లేపల్లి-బీబీనగర్‌ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించడంతో షర్మిల ఆందోళన విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement