Thursday, May 2, 2024

మ‌హేశ్,న‌మ్ర‌త‌ల పెళ్ల‌యి 17ఏళ్లు – ట్వీట్ చేసిన సూప‌ర్ స్టార్

నేడు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, న‌మ‌త్ర‌ల పెళ్లిరోజు. ఈ ఏడాదితో 17సంవ‌త్స‌రాలు అయింద‌ట వారి పెళ్లి జ‌రిగి.. ఈ సందర్భంగా భార్యాపిల్లల ఫొటోను పోస్ట్ చేసి తన శ్రీమతికి స్పెషల్ గా విషెస్ చెప్పారు మ‌హేశ్ బాబు. ఎన్ఎస్జీ అంటూ శుభాకాంక్షలు చెప్పారు. ‘‘అప్పుడే 17 ఏళ్లు గడిచిపోయాయా? పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎన్ఎస్జీ. ఇలాంటి పెళ్లిరోజులు మరెన్నో మనం జరుపుకోవాలి. అంతా ప్రేమ నిండాలి’’ అని మహేశ్ ట్వీట్ చేశారు. సితార, గౌతమ్, నమ్రతతో కలిసి ఉన్న ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. ఇంతకీ ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనుకునేరు.. ఎన్ఎస్జీ అంటే మహేశ్ శ్రీమతి నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేనికి షార్ట్ ఫాం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement