Friday, May 3, 2024

Breaking : క‌ర్నూలు క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త

ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి యత్నించాయి. 2.35 లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ క‌లెక్ట‌రేట్ ముట్ట‌డికి దీంతో క‌ర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. విద్యార్థులు గేట్లు ఎక్కి కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని 200 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement