Friday, May 17, 2024

ఉద్రిక్తంగా మారిన‌ మ‌హాపాద‌యాత్ర‌..విరిగిన రైతు చెయ్యి..

ఏపీ రైతుల మ‌హా పాద‌యాత్ర ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతోంది. వారి యాత్ర నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. యాత్రకు అనుమతి లేదంటూ నిలువరించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతు చెయ్యి విరిగింది. ఈ క్రమంలో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మరోవైపు రైతుల పాదయాత్రకు స్థానికులూ సంఘీభావం ప్రకటించారు. అయితే, రైతులు వేరే ప్రాంతాల్లో ప్రవేశించకుండా చెక్ పోస్టులను పెట్టి, ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినా కూడా రైతులు ముందుకే కదులుతున్నారు. ఆంక్షల నడుమనే పాదయాత్ర చేస్తున్నారు. ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు పాదయాత్ర చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement