Friday, May 10, 2024

మ‌హ‌బుబాబాద్‌ జిల్లాలో ఘోరం.. చెరువు కట్టపై తల, మొండెం వేరుచేసిన మృతదేహం

గూడూరు (ప్రభ న్యూస్): మహబూబాబాద్ జిల్లాలో తల, మొండెం వేరు చేసిన ఓ డెడ్​బాడీ ఇవ్వాల కనిపించింది.. ఇది చూసి గూడూరు మండలం బొల్లేపల్లి గ్రామ‌స్తులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. గ్రామ శివారు ఎస్సీ కాలనీ ముందు ఉన్న చిన్న చెరువుకట్ట పైన తల, మొండెం వేరు చేసి చంపేసిన‌ట్టు మృతదేహాన్ని చూస్తే తెలుస్తోంది. కాగా, ఈ గుర్తుతెలియని మృతదేహం పడేసి చాలా రోజులవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఎవ‌రిద‌నే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది. ఎక్కడనుండి తీసుకొచ్చి ఇక్క‌డ పేడేశారో అని స్థానికులు చ‌ర్చించుకుంటున్నారు. ఈ విష‌య‌మై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement