Wednesday, May 8, 2024

కేంద్ర‌మంత్రితో భేటీ అయిన హీరో మంచువిష్ణు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు..కేంద్ర సాంస్కృతిక..ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో భేటీ అయ్యారు.
హైద‌రాబాద్‌లో మంత్రి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అయితే ఈ భేటీలో కేంద్ర మంత్రితో విష్ణు ఏం మాట్లాడార‌న్న వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. మంచు విష్ణు త‌న‌ను క‌లిసిన విష‌యాన్ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కార్యాలయం త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. అయితే ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. అసలు మంచు విష్ణు కేంద్ర మంత్రిని ఎందుకు కలిశారన్న దానిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతుంది. మంచు విష్ణు హీరోగా.. కేంద్ర మంత్రిని కలిసి ఉంటే.. మర్యదపూర్వకంగా భేటీ అనుకోవచ్చు కాని విష్ణు మా అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. అందులోనే ఆయన కలిసింది సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రిని. అసోసియేషన్ కోసంఏదైనా అడిగారా అంటే.. ఆ విషయం అఫీయల్ గాబయటకు వచ్చేదిగా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే రీసెంట్ గా మంచు విష్ణు తిరుపతిలో స్టూడియోలు కడతా అన్ని అన్నారు. ఆ విషయం గురించి మంత్రితో మాట్లాడి ఉంటారా.. ఏక రీసెంట్ గా యూనివర్సిటీ హోదా వచ్చిన తన విద్యాసంస్థల విషయంలో ఏదైనా అడిగి ఉంటారా అని బయట చర్చలుజరుగుతున్నాయి. వీరి భేటీపై మరో వాదన కూడా జరుగుతుంది. మంచు విష్ణు బిజేపిలో చేరబోతున్నారని. దానికోసమే ఆయన కిషన్ రెడ్డితో భేటీ అయ్యారని మరో పొలిటికల్ గాసిప్ గట్టిగా నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement