Thursday, April 25, 2024

Flash: భార్యపై అనుమానంతో భర్త దాడి

జయశంకర్ భూపాలపల్లిలోని రామ్ నగర్ లో దారుణం జరిగింది. భార్యని భర్త దారుణంగా దాడి చేశాడు. భర్త అంబాల రమేష్.. రెండో భార్య రాజ్యలక్ష్మి (30)పై అనుమానంతో దాడి చేశాడు. దీంతో ఆమె పరిస్థితి విషమం మారింది. హుటాహుటిన 108 లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే అంబాల రమేష్ కు మొదటి భార్య శైలజా ఉండగా ఆమెకు పిల్లలు కావడం లేదని కాటారం మండలం రుద్రారం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మిని ఇటీవలే వివాహం చేసుకున్నాడు. గత ఆరు నెలల నుండి సుభాష్ కాలనీ రామ్ నగర్ లో నివాసం ఉంటున్నారు.  అయితే, ఆమెపై అనుమానంతో తెల్లవారుజామున దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రమేష్ కేటీకే ఓపెన్ కాస్ట్ లో సైట్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement