ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఉత్తర కొరియాలో కరోనా అనుమానిత కేసులు 8,20,620కు చేరాయి. దేశవ్యాప్తంగా 3,24,550 మంది చికిత్స తీసుకుంటున్నారని అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. జ్వరంతో మరో 15 మంది మరణించారని తెలిపింది. కేవలం మూడు రోజుల్లో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 42కి చేరుకుందని పేర్కొంది. ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు గత గురువారం (ఈ నెల 12న) నమోదైంది. మరిసటి రోజు (13వ తేదీన) కరోనాతో ఓ వ్యక్తి మరణించారు. ఇప్పటివరకు 42 మంది మృతిచెందారు. కాగా, కరోనా తొలిసారిగా వెలుగు చూసిన వెంటనే అధ్యక్షుడు కిమ్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో వ్యాపార, వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. కరోనాతో నిన్న ఆరుగురు మృతి చెందారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement