Thursday, May 2, 2024

కానిస్టేబుల్ ని కొట్టిన – ముగ్గురి అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో రోడ్డుపై గొడవ చేస్తున్న ముగ్గురు యువకులు కానిస్టేబుల్‌ను దారుణంగా కొట్టారు. కానిస్టేబుల్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మొరాదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు సీరియస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సయోహరా పోలీస్ స్టేషన్‌లో నియమించబడిన సిపాయి సత్యేంద్ర సింగ్ ఈద్ ప్రార్థనల డ్యూటీ ముగించుకుని బుధన్‌పూర్ నుండి సయోహరా పోలీస్ స్టేషన్‌కి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యంలో వంతెన సమీపంలో వాహనాన్ని కాపాడే ప్రయత్నంలో బైక్ జారి కిందపడిపోయాడు. రోడ్డుపై వీరంగం సృష్టిస్తున్న ముగ్గురు యువకులు అత‌నిని దుర్భాష‌లాడారు.. కానిస్టేబుల్ ప్రతిఘటించడంతో ముగ్గురు కలిసి అతడిని కొట్టి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అత‌ని పరిస్థితి విషమంగా ఉండడంతో మొరాదాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, మూడో వ్యక్తిని తాజ్‌పూర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement