Thursday, May 2, 2024

లోక్ సభ స్పీకర్ కు కరోనా

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి  కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడగా, తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా సోసింది. ఈ మేరకు వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు వెల్లడైంది. . దాంతో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  మార్చి 19న ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని టెస్టుల ద్వారా తెలిసిందని డాక్టర్లు వివరించారు. మార్చి 20న ఆయన ఎయిమ్స్ లోని కొవిడ్ కేర్ సెంటర్‌లో అబ్జర్వేషన్ కోసం చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, శరీరంలోని అన్ని వ్యవస్థలూ సాధారణంగానే ఉన్నాయని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement