Tuesday, May 21, 2024

హెటెరో ల్యాబ్స్ ప్లాంట్ ఆవ‌ర‌ణ‌లో చిరుత‌పులి – బంధించేందుకు చ‌ర్య‌లు

సంగారెడ్డిలోని గ‌డ్డ‌పోతారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హెటెరో ల్యాబ్స్ ప్లాంట్ ఆవ‌ర‌ణ‌లోకి చిరుత‌పులి ప్ర‌వేశించింది. కంపెనీ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు దీన్ని రికార్డు చేశాయి. బుధవారం అర్ధరాత్రి ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. దీన్ని చూసి ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు. చిరుతపులి కదలికల సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు హెటెరో ల్యాబ్స్ తెలియజేసింది. దీంతో అటవీ అధికారులు, సిబ్బందితో కూడిన బృందం హెటోరో ల్యాబ్స్ ప్లాంట్ కు చేరుకుంది. చిరుతపులిని బంధించే చర్యలు ప్రారంభించింది. గతంలోనూ హైదరాబాద్ పరిసరాల్లో చిరుతపులుల సంచారం ఎన్నో సార్లు వెలుగుచూసింది. రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుతపులి పలు సందర్భాల్లో కనిపించినా కానీ, అటవీ అధికారులకు చిక్కకుండా అది తప్పించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement