Thursday, May 2, 2024

ఈరోజు లీగ‌ల్‌ అప్‌డేట్స్‌.. ఏమున్నాయంటే..

విద్య వినియోగదారుల రక్షణ చట్టం, 1986 పరిధిలోకి వస్తుందా లేదా అనే ప్రశ్నను లేవనెత్తిన అప్పీల్‌లో ఈరోజు సుప్రీం కోర్టు అనుమతిని మంజూరు చేసింది.

RT-PCR పరీక్షలకు వసూలు చేసే రేటును ₹500కి పరిమితం చేయాలని కేర‌ళ ప్రభుత్వ నిర్ణ‌యించింద‌. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేర‌ళ హైకోర్టు అనుమ‌తించింది. కాగా, సింగిల్ జడ్జి ఉత్తర్వుపై కేరళ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను ఈరోజు కేరళ హైకోర్టు నోటీసు జారీ చేసింది.

కేర‌ళ ప్రభుత్వానికి చెందిన పద్మనాభ స్వామి ఆలయ ఆస్తులకు సంబంధించి 2017 నుండి యాన్యుటీ బకాయిలు పెండింగ్‌లు ఉన్నాయి. వాటిని చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందనను ఈరోజు కేరళ హైకోర్టు కోరింది.

జమ్మూ కాశ్మీర్ , లడఖ్ హైకోర్టులకు ఇద్దరు న్యాయాధికారులను న్యాయమూర్తులుగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమిస్తూ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేశారు.

క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన వెంటనే స్వతంత్ర సాక్షి కిరణ్ గోసావి, షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ మధ్య మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సామ్ డిసౌజా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈ రోజు బాంబే హైకోర్టు తిరస్కరించింది.

- Advertisement -

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్ ప్రతిప్ చౌద‌రికి సంబంధించిన రుణాల కుంభకోణానికి సంబంధించి న్యాయ సంస్థ ధీర్ అండ్ ధీర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ భాగస్వామి అలోక్ ధీర్‌కు ఈరోజు ఢిల్లీ హైకోర్టు ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

గౌహతి హైకోర్టు దర్రాంగ్ జిల్లాలో తొలగింపులు, తదనంతర హింసాకాండకు సంబంధించిన పిటీషన్‌ల విచార‌ణ జ‌రుపుతోంది. అసోం ప్రభుత్వం నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా తీర్ప‌వు వ‌చ్చింది. ఏ వ్యక్తిపై అయినా బలవంతపు చర్య తీసుకోదని పేర్కొంది.

ఒక హత్య కేసులో నిందితుడికి క‌ర్నాట‌క‌ హైకోర్టు పెరోల్ మంజూరు చేసింది. దోషులు జైలులో ఉన్న‌ప్పుడు సమాజంలో వారి స్థితిగ‌తుల‌పై మానవతా దృక్పథాన్ని అనుసరించాలని పిలుపునిచ్చింది ధ‌ర్మాస‌నం.

క‌ర్నాట‌క‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయవాదులు నియ‌మితుల‌య్యారు. వీరిలో జ‌స్టిస్‌ అనంత్ రామనాథ్ హెగ్డే, జ‌స్టిస్ సిద్దయ్య రాచయ్య, జ‌స్టిస్ కన్నంకుజియిల్ శ్రీధరన్ హేమలేఖ అనే ముగ్గురు న్యాయవాదుల నియామకానికి సంబంధించి రెండేళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది.

ఒడిశౄ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది ఆదిత్య కుమార్ మహపాత్రను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది.

భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 494 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు విచార‌ణ జ‌ర‌గ‌నుంది. దీనిపై కేరళ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది,

Advertisement

తాజా వార్తలు

Advertisement