Friday, April 26, 2024

Breaking : నెల్లూరు సంగం బ్యారేజ్ కు దివంగ‌త మంత్రి ‘గౌత‌మ్ రెడ్డి’ పేరు – సీఎం జ‌గ‌న్

నెల్లూరు సంగం బ్యారేజ్ కు దివంగ‌త మంత్రి గౌత‌మ్ రెడ్డి పేరు పెడ‌తామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. ఈ మేర‌కు జ‌గ‌న్ అసెంబ్లీలో ఈ ప్ర‌క‌ట‌న చేశారు. గౌత‌మ్ రెడ్డి మృతి రాష్ట్రానికి తీర‌ని లోట‌న్నారు. గౌత‌మ్ రెడ్డితో నాకున్న స్నేహం మ‌రిచిపోలేనిద‌న్నారు జ‌గ‌న్. కాంగ్రెస్ విభేధించి బ‌య‌ట‌కు వ‌చ్చాను ..ఈ స్థాయిలో ఉంటాన‌ని అప్పుడు నేనూ ఊహించ‌లేదు..కానీ అప్పుడు నాతో ఉన్న అతికొద్ది మందిలో గౌత‌మ్ ఒక‌రి గుర్తు చేసుకున్నారు సీఎం జ‌గ‌న్. కేబినెట్ లో ఆరు శాఖ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించార‌ని తెలిపారు.ఈ మేర‌కు అన్ని శాఖ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించార‌ని జ‌గ‌న్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement