Tuesday, April 30, 2024

ఏపీపై కేటీఆర్ చెప్పిందే వాస్తవం: జేసీ ఆసక్తికర కామెంట్

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తన వ్యాఖ్యలను ఎందుకు వెనక్కి తీసుకున్నారని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. ‘‘ఏపీ పరిస్థితులను కేటీఆర్‌ కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఆయన చెప్పినవన్నీ ముమ్మాటికీ వాస్తవం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని షర్మిల విమర్శిస్తున్నప్పుడు కేటీఆర్‌ మాటల్లో తప్పేముంది. ఆయనతో కలిసి ఏపీ పరిస్థితులపై ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. 2018 ప్రభోదానంద కేసులో ఇప్పటికీ అమాయకులను కేసులో చేర్చుతున్నారు. ఎస్పీ చేతిలో ఏమీ లేనట్లుంది.. సజ్జల కనుసన్నల్లోనే పనిచేస్తున్నట్లుంది’’ అని జేసీ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement