Thursday, May 2, 2024

యాద‌గిరిగుట్ట ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి వారి క్షేత్రంలో- కృష్ణాష్ట‌మి వేడుక‌లు

ఈ నెల 20నుంచి యాద‌గిరిగుట్ట శ్రీ పాత ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి వారి క్షేత్రంలో కృష్ణాష్ణ‌మి వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు శ్రీ కృష్ణాష్టమి కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని అధికారులు వెల్లడించారు.ఈనెల 22న (సోమవారం) శ్రీకృష్ణ జయంతి సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 4.30 గంటలకు ఉట్లు కోట్టే కార్యక్రమం (శిఖ్యోత్సవము) నిర్వహిస్తామన్నారు. అదేరోజు రాత్రి 7.45 గంటలకు రుక్మిణి కల్యాణోత్సవం నిర్వహిస్తాని తెలిపారు. కణ్ణన్ తిరునక్షత్రం సందర్భంగా శనివారం నాటి నిత్య కల్యాణం, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, భోగములు రద్దు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement