Friday, April 26, 2024

Big Breaking: దేశ రాజకీయాల్లోకి బీఆర్​ఎస్​.. పార్టీ మార్పుపై కేసీఆర్​ సంతకం!

జాతీయ రాజకీయ పార్టీగా బీఆర్​ఎస్ అవతరించింది​.. భారత్​ రాష్ట్ర సమితిగా టీఆర్​ఎస్​ మార్పు చెందింది. ఈ మేరకు ఇవ్వాల హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ప్రవేశపెట్టిన తీర్మానంపై పెద్ద ఎత్తున చర్చంచారు. ఈ తీర్మానంపై చర్చ అనంతరం ఏకగ్రీవంగా పార్టీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సరిగ్గా 1.19 నిమిషాలకు బీఆర్​ఎస్​ పార్టీ మార్పుపై సంతకం చేశారు. ఇక తెలంగాణ నుంచి మరో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది.

పార్టీ పేరు మారుస్తూ సీఎం కేసీఆర్​ సంతకం చేసిన వెంటనే తెలంగాణ భవన్​ ఎదుట పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తూ సంబురాలు చేశారు కార్యకర్తలు, బీఆర్​ఎస్​ జిందాబాద్​, దేశ్​కీ నేతా కేసీఆర్​ అనే నినాదాలు మిన్నంటాయి. స్వీట్లు పంచుకుని సంబురాల్లో మునిగి తేలారు. డప్పు చప్పుళ్లు, మేళాలతో డ్యాన్సులు చేస్తూ సందడి వాతారణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement