Wednesday, May 1, 2024

కేసీఆర్ ఎత్తుకు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్.. కేటీఆర్

హైదరాబాద్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కాకుండా అడ్డుకోవడంలో కేసీఆర్ విజయం సాధించారని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశీలనకు సింగరేణి బృందాన్ని పంప‌డంతో కేంద్రం దిగివ‌చ్చింద‌ని అభివ‌ర్ణించారు. కేసీఆర్ ఎత్తు వేస్తే ఇలాగే ఉంటుంద‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో భార‌త రాష్ట్ర స‌మితి తొలి విజ‌యం సాధించిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని ప‌లు సంద‌ర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్ పోరాటంతో కేంద్రం దిగివ‌చ్చిందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై కేంద్రం వెనుక‌డుగు వేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement