Thursday, April 25, 2024

మానుకోటలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్‌ జిల్లా పర్యటనలో ఉన్నారు. జిల్లాలోని మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ కార్యాలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవితను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, రాజయ్య, పలువురు ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement