Sunday, April 28, 2024

వైఎస్ షర్మిలకు కేసీఆర్ సర్కారు షాక్

తెలంగాణలో కొత్త పార్టీ సన్నాహాల్లో ఉన్న వైఎస్ షర్మిలకు కేసీఆర్ సర్కారు షాకిచ్చింది. ఆమెకు 15 రోజుల క్రితం ప్రభుత్వం కేటాయించిన 2 ప్లస్ 2 గన్‌మెన్‌లను ఉపసంహరించింది. దీనిపై షర్మిల అభిమానులు కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కాగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్ షర్మిల పలు జిల్లాలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల తన ప్రసంగాల్లో నిరుద్యోగుల తరుపున పోరాడుతానని, వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు. దీంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చేపట్టిన దీక్షకు కూడా షర్మిల మద్దతు పలికారు. కాగా ప్రభుత్వంపై షర్మిల వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే కేసీఆర్ సర్కారు షర్మిల గన్‌మెన్‌లను ఉపసంహరించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement