Thursday, May 2, 2024

కాంగ్రెస్ కి.. క‌మ‌ల్ హాస‌న్ మ‌ద్ద‌తు

సినీ సెల‌బ్రిటీలు ఎల‌క్ష‌న్స్ టైంలో ప‌లు పార్టీల‌కు ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తుండటం కామ‌నే..కాగా మ‌రికొన్ని రోజుల్లో క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాగా విశ్వ న‌టుడు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌నున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కోరిక మేరకు ఆయన మే మొదటివారంలో కాంగ్రెస్‌ కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఆయన ప్రచార పర్యటన వివరాలు వెల్లడిస్తామన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు స్టార్ హీరో ఢిల్లీలో ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం కమల హాసన్ ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్‌ నీదిమయ్యం కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవటం ఖాయమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడున్నారు. లోక్‌సభ ఎన్నికల విషయమై కమల హాసన్ మూడు రోజుల కిందట కోయంబత్తూరు, సేలం జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‏తో పొత్తు ఖరారైతే కమల హాసన్‌ కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉంది.మ‌రి క‌మ‌ల్ హాస‌న్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం విశేషంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement