Friday, May 3, 2024

జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ ఆస‌క్తిక‌ర కామెంట్స్ – ఆ దంప‌తుల‌కి కోర్టుని చూడ‌క‌పోతే నిద్ర ప‌ట్ట‌దు

భార్య‌భ‌ర్త‌లు అన్నాక చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌స్తూనే ఉంటాయి. అయితే ఓ జంట మాత్రం నిత్యం గొడ‌వ‌ప‌డ‌ట‌మే కాదు..ఒక‌రిపై ఒక‌రు 60కేసులు పెట్టుకోవ‌డం విశేషం. కాగా 30 ఏళ్లు కాపురం చేసి.. మనస్ఫర్థల కారణంగా విడిపోయారు. 11 ఏళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు. ఇప్పుడూ వాళ్లిద్దరూ కోర్టుకెక్కడంతో సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ మిహా కోహ్లీ, జస్టిస్ కృష్ణ మురారిల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారి కేసుపై స్పందించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. మీ లాయర్ల తెలివితేటల్ని తప్పక గుర్తించాల్సిందే’’ అంటూ కామెంట్ చేశారు. కొన్ని వివాదాలు ఓ పట్టాన పరిష్కారం కావు. ఎప్పుడైనా ఒక్కరోజు కోర్టును చూడకపోతే వారికి నిద్ర పట్టదు, ఏం చేద్దాం! వాళ్లు ఎప్పుడూ కోర్టు చుట్టూ తిరగడానికే ఇష్టపడతారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసును పరిష్కరించుకోవాలని దంపతులకు సూచించారు. అలాగే మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకునే వ‌ర‌కు .. వేరే పెండింగ్ కేసులపై కోర్టుకు వెళ్లరాదని దంపతులకు ధర్మాసనం తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement