Thursday, May 2, 2024

Paddy issue: కేంద్రం మెడలు వంచే వరకూ పోరాడుతా: కరీంనగర్ లో మంత్రి గంగుల మహాగర్జన

తెలంగాణలో పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్‌ఎస్‌ మరోసారి డిమాండ్‌ చేసింది. వడ్లు కొనకుండా రైతులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి అధ్యక్షతన జరిగిన మహధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం మెడలు వంచే విధంగా పోరాడుతామని అన్నారు. కేంద్రం ధాన్యం విషయంలో చేస్తున్న రోజుకో ప్రకటనపై ధ్వజమెత్తారు. పార్టీ శ్రేణులు గురువారం వడ్ల కుప్పలు, వరి గొలుసులతో రైతులు తరలివచ్చి కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement