Monday, May 20, 2024

కర్నూల్ ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం

తనకు నమస్తే పెట్టలేదని ఓ సీనియర్.. జూనియర్ ను ర్యాగింగ్ చేసిన ఘటన కర్నూలు ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. బుధవారం రాత్రి జరిగినట్లుగా చెబుతున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూల్ నగర జగన్నాథ గట్టు లోగల ట్రిపుల్ ఐటీ కాలేజీ క్యాంపస్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై ఫైనలియర్ విద్యార్ధి దాడికి దిగారని సమాచారం. తనకు నమస్తే పెట్టలేదని ఫస్టియర్ విద్యార్ధిపై ఫైనలియర్ విద్యార్ధి దాడి చేశారని బాధితుడి ఆరోపించాడు. ట్రిపుల్ ఐటీ కాలేజీలో ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్ధులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలేజీ వద్ద విద్యార్ధి సంఘాలు శుక్రవారం ఆందోళనకు దిగాయి. అయితే ర్యాగింగ్ విషయాన్ని కాలేజీ డైరెక్టర్ సోమయాజులు ఖండించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement