Saturday, May 4, 2024

ఏపీ అభివృద్ధి కోసం బిజెపితో చేతులు క‌ల‌పండి – జ‌గ‌న్ కి పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి

ఒక రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే అభివృద్ధి స‌రిగా జ‌ర‌గ‌డం లేద‌ని , అటువంట‌ప్పుడు మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న స‌రికాద‌ని కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే అన్నారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మాట్లాడుతూ ..మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని ఇప్పటికీ రాష్ట్ర మంత్రులు చెపుతూనే ఉన్నారు. మూడు రాజధానులతో ప్రజలకు సౌలభ్యంగానే ఉంటుందని… కానీ, మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టమని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధాని మోడీని సీఎం జగన్ కలసి కోరాలని సూచించారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీతో, జగన్ చేతులు కలపాలని హితవు పలికారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం తాను కూడా ప్రయత్నిస్తానని చెప్పారు. పార్లమెంటులో పెట్టే అన్ని బిల్లులకు వైసీపీ మద్దతిస్తోందని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement