Wednesday, May 1, 2024

ఉగ్రవాదుల మ‌రో ఘాతుకం – ఎస్ ఐ ఇంట్లోకి చొర‌బ‌డి కాల్చివేత‌

ఓ పోలీస్ అధికారి ఇంట్లోకి చొర‌బ‌డి అత‌డిని కాల్చి చంపారు ఉగ్ర‌వాదులు. జ‌మ్మూ క‌శ్మీర్ లోని పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలోని సంబూరాలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఫరూఖ్‌ అహ్మద్‌ మీర్‌ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఎస్పైపై కాల్పులు జరిపారు. ముష్కరుల దాడిలో గాయపడ్డ ఎస్ఐ ఫరూక్ అక్కడిక్కడే చనిపోయారు. ఫరూక్ ప్రస్తుతం లేత్‌పొరాలో సిటీసీలోని ఐఆర్‌పీ 23వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు తండ్రి, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

https://twitter.com/kashmiriupdates/status/1538020914818088960
Advertisement

తాజా వార్తలు

Advertisement