Monday, April 29, 2024

ఎన్డీఏకు జేడీయూ గుడ్ బై.. గవర్నర్ ను కలవనున్న నితీశ్ కుమార్..

ఎన్డీఏకు జేడీయూ గుడ్ బై చెప్పింది. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ బీజేపీతో ఉన్న బంధానికి బ్రేక్ వేశారు. బీహార్‌లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌.. బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు స‌రిగా లేని కార‌ణంగా.. ఆ కూట‌మికి నితీశ్ కుమార్ ఈరోజు గుడ్‌బై చెప్పేశారు. బీజేపీ (77)-జేడీయూ (45) కూట‌మి పాల‌న బీహార్‌లో ముగిసిపోయింది. బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న‌ట్లు నితీశ్ కుమార్ త‌మ ఎమ్మెల్యేల‌కు చెప్పారు. ఈరోజు సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్నారు.అయితే ఆర్జేడీ, కాంగ్రెస్‌తో క‌లిసి నితీశ్ కుమార్‌.. కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశాలున్నాయి. అయితే నితీశ్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీలు మ‌ద్ద‌తు తెలిపిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. నితీశ్ సీఎంగానే కొన‌సాగే అవకాశముంది. ఈ పరిణామాల మధ్య బీజేపీ సైలెంట్ గా ఉంది. బీజేపీ తర్వాత వ్యూహం ఏంటనేది అంతుచిక్కడం లేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement