Friday, March 29, 2024

ALERT : అప్ర‌మ‌త్తంగా ఉండండి… గోదావరి 55 అడుగులు చేరే అవకాశం : కలెక్టర్ అనుదీప్

భద్రాచలం : గోదావరికి ఎగువనున్న ప్రాణహిత, ఇంద్రావతి, నదుల నుండి వస్తున్న వరద కారణంగా మంగళవారం రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి వరద 55 అడుగులకు పెరిగే అవకాశం ఉన్నదని, ముంపు మండలాల ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పారు. పశువులను బయటకు వదలకుండా ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంచాలని,జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని ఆయన హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement