Friday, April 26, 2024

jammu kashmir : ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఈ తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో సోపియాన్‌ జిల్లా ముంజ్‌ మార్గ్‌ ఏరియాలోని ఓ ఇంట్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులకు లొంగిపోవాలని హెచ్చరికలు చేయగా, ఉగ్రవాదులు భద్రతా బలగాల హెచ్చరికలను లెక్కచేయకుండా కాల్పులకు తెగబడ్డారు. దాంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు ఉగ్రవాదులు లతీఫ్‌ లోన్‌ ఏరియాకు చెందిన వారు కాగా.. మరో ఉగ్రవాది ఉమర్‌ నజీర్‌ అనంతనాగ్‌ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించినట్లు కశ్మీర్‌ అదనపు డీజీపీ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement