Friday, May 10, 2024

మైక్రోసాప్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల కుమారుడు ‘జైన్’ మృతి

మైక్రోసాప్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల కుమారుడు జైన్ మృతి చెందాడు. జైన్ వ‌య‌సు 26సంవ‌త్స‌రాలు. సెరెబ్ర‌ల్ ప‌ల్సీ అనే వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు జైన్. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులందరికీ మెయిల్ ద్వారా ఈ విషయాన్ని సంస్థ వెల్లడించింది. ఆయన కుటుంబం ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ మైక్రోసాఫ్ట్ మెయిల్ చేసింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. సత్య నాదెళ్ల కుమారుడు జైన్.. పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. చిన్నప్పటి నుంచి వీల్ చైర్‌కే జైన్ అంకితమయ్యాడు. జైన్ నడవలేడు, చూడలేడు, సరిగా మాట్లాడలేడు. ఇక ఈ బాధను భరించలేక ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ నాదెళ్ల తిరిగారు కానీ ఎలాంటి ఫలితం లేదు. ఒకవైపు తన కొడుకు పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ , ప్రపంచాన్ని ముందడుగు వేయించాలనే తపనతో నాదెళ్ల ఎప్పుడూ శ్రమిస్తూనే ఉన్నారు. కానీ చివరికి జైన్ కన్నుమూయ‌డం బాధాక‌ర విష‌యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement