Thursday, May 2, 2024

TDP: ఓటర్ జాబితా అక్రమాలపై పోరాడాలి… చంద్రబాబు

ఓటర్ జాబితా అక్రమాలపై పోరాడాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భారీ ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ నేతలు పలుమార్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా అవకతవకలపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ యంత్రాంగం గుర్తించిన వాటిని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఇప్పటివరకు 20లక్షల దొంగ ఓట్లు ఉన్నట్టు గుర్తించామన్నారు. పార్టీ పరంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరిన్ని ఆధారాలు సేకరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఓటరు జాబితా అక్రమాలపై నిరంతర పోరాటం చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తే ఓడిపోతామనే అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement