Monday, April 29, 2024

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విపై… శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున ఖర్గేతో తన పోటీ ఓ యుద్ధమ‌ని భావించొద్దన్నారు. తామిద్దరూ భిన్న దృక్పథాలకు చెందినవాళ్లమని తెలిపారు. తమలో విజేత ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిర్ణయిస్తారని శశిథరూర్ వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ తాను చెప్పేదొక్కటే… కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కార్యకలాపాలపై మీరు సంతృప్తి చెందినట్టయితే దయచేసి ఖర్గే కు ఓటేయండి. ఒకవేళ మీరు మార్పు కోరుకుంటున్నట్టయితే నాకు ఓటేయండి. పార్టీ వ్యవహార సరళి నచ్చనివారు నన్ను ఎంచుకోండి… పార్టీలో మార్పు తీసుకువచ్చేందుకు నేను సిద్ధమే! సిద్ధాంతపరమైన సమస్యలేమీ లేవు” అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా… మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం విధిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement