Monday, April 29, 2024

Breaking: ఫెయిలైన ఇంటర్ విద్యార్థులందరూ పాస్

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ప్రకటించారు. ఫెయిలైన విద్యార్థులందరికీ కనీస పాస్ మార్కులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు.

ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి కాగా, 51 శాతం మంది ఫెయిల్ కావడం పట్ల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫలితాలతో వేదన చెంది పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్ ఫలితాలపై భగ్గుమన్న ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.  ఫెయిల్ అయిన విద్యార్థులు అందర్నీ పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement