Tuesday, April 23, 2024

Covid-19: ఏపీలో 94 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో మరోమారు 100కి దిగువన కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 29,801 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 94 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 12, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 139 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,306 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,60,539 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,279 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,488కి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement