Monday, April 29, 2024

మాస్క్ లాంటి పెయింటింగ్ వేసుకున్న యువతి

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరిగా పాటించాలి. మాస్కులతోనే మన ప్రాణాలకు రక్షణ అని అధికారులు ఎంతగా మొత్తుకుంటున్నా, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్క్ పెట్టుకోమంటే కొంత మంది ఎందుకో గానీ వ్యతిరేకిస్తారు. అలాంటి ఓ యువతి… మాస్క్ లాగా పెయింటింగ్ వేసుకుంది. ఇండోనేషియాలో ఓ యువతి చేసిన పని ఆమెని చిక్కుల్లో పడేసింది.

ఇండొనేసియాలోని పర్యాటక ప్రాంతం బాలిలో జోష్ పాలెర్ లిన్, లియా సీ జంట షాపింగ్ చేసింది. అయితే షాపింగ్ చేయాలంటే మాస్క్ తప్పనిసరి అని సెక్యూరిటీ గార్డు యువతిని అనుమతి ఇవ్వలేదు. దీంతో మాస్క్ లాంటి పెయింటింగ్ వేసుకుంది. కారులో బ్లూ కలర్ పెయింట్ వేసుకోవడం, చెవులకు మాస్క్ దారం ఉన్నట్లుగా వైట్ కలర్ పెయింటింగ్ వేసుకుంది. తమ ముఖాలకు సర్జికల్ మాస్క్ మాదిరిగా కనిపించేలా నీలి రంగులో మాస్క్ లు వేసుకుని సూపర్ మార్కెట్ కు వచ్చారు. దూరం నుంచి ఆమెను చూసిన వారికి… ఆమె మాస్క్ పెట్టుకున్నట్లే కనిపించింది. దీంతో ఆమె షాపింగ్ మాల్‌ లోకి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డు కూడా గుర్తించలేకపోయాడు. అయితే, ఆ యువతి భర్త మాత్రం మాస్క్ పెట్టుకున్నాడు. ఆపై సదరు జంట వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. దీంతో ఇండోనేషియా అధికారులు, వారిద్దరి పాస్ పోర్టులను సీజ్ చేశారు.

https://youtu.be/2sC0TFzxMj4
Advertisement

తాజా వార్తలు

Advertisement